యూసీసీ అమలుకు గుజరాత్​ సిద్ధం

Gujarat is ready for the implementation of UCC

Feb 4, 2025 - 14:04
 0
యూసీసీ అమలుకు గుజరాత్​ సిద్ధం

ఐదుగురు అధ్యక్షతన కమిటీ నియామకం
ప్రకటించిన సీఎం భూపేంద్ర పటేల్​

గాంధీనగర్​: గుజరాత్​ లో యూసీసీ అమలుకు పూర్తి ప్రణాళిక సిద్ధమైంది. ఆ రాష్ర్ట సీఎం భూపేంద్ర పటేల్​ మంగళవారం విలేఖరుల సమావేశంలో పలు వివరాలు వెల్లడించారు. యూసీసీకి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కమిటీలో సుప్రీంకోర్టు రిటైర్డ్​ న్యాయమూర్తులు రంజనా దేశాయ్​, సిఎల్​ మీనా, ఆర్సీ కోడేకర్​, దక్షేష్​ ఠాక్రే, గీత ప్రాష్​ లకు చోటు కల్పించారు. రాష్ర్ట పౌరులకు సమాన హక్కులు కల్పించేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని ఉమ్మడి పౌర నియమావళికి కట్టుబడి ఉన్నామని, యూసీసీ అమలు చేయాలని నిర్ణయించామన్నారు. ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేర్చామన్నారు. మోదీ సంకల్పాన్ని సాకారం చేసుకునే దిశగా గుజరాత్​ ముందుకు సాగుతుందన్నారు. ఈ కమిటీ 45 రోజుల్లో రాష్​ర్ట ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుందని స్పష్టం చేశారు. కమిటీ నివేదిక ఆధారంగా యూసీసీపై నిర్ణయం తీసుకుంటామన్నారు.