ఈ శ్రమ్​ లో 1.23 కోట్ల నూతన రిజిస్ట్రేషన్ లు

ఇప్పటివరకు 30.58 కోట్ల మంది చేరిక

Feb 4, 2025 - 13:52
 0
ఈ శ్రమ్​ లో 1.23 కోట్ల నూతన రిజిస్ట్రేషన్ లు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఈశ్రమ్​ పోర్టల్​ లో 2024లో 1.23 కోట్ల కొత్త రిజిస్ర్టేషన్‌లతో పేర్లు నమోదు చేసుకున్న కార్మికుల సంఖ్య 30.58 కోట్లకు చేరిందని సమగ్ర జాతీయ అసంఘటిత కార్మికుల డేటాబేస్​ (ఎన్​ డీయూడబ్ల్యూ) వెల్లడించింది. ఈ సంస్థ కార్మికులకు పీఎఫ్​ అకౌంట్​ కోసం యూఎఎన్​ నెంబర్​ ను (యూనివర్సెల్​ ఐడెంటిటీ నంబర్​)ను అందజేస్తుంది. నివేదిక సమాచారాన్ని మంగళవారం కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే తెలిపారు. సగటున రోజువారీ నమోదులు 33,700 ఉన్నట్లు తెలిపారు. ఈశ్రమ్​ పోర్టల్​ ద్వారా కార్మికుల కోసం అనేక రకాల సదుపాయాలను కల్పించారు. ఈ పోర్టల్​ ద్వారా ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్-ధన్ (పీఎం ఎస్​ వైఎం) – 60 సంవత్సరాల వయస్సు తర్వాత నెలకు రూ.3,000 పెన్షన్ అందించే పెన్షన్ పథకం. కార్మికులను నమోదు చేసేందుకు రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో ఈ సంస్థ డేటాను పంచుకుంటుంది. అదే సమయంలో కార్మికులకు నైపుణ్య శిక్షణ, అప్రెంటిస్​ షిప్​ అవకాశాల కోసం డిజిటల్​ ఫ్లాట్​ ఫామ్​ తో అనుసంధానిస్తారు. ఈ పోర్టల్​ ద్వారా కార్మికుల అర్హతలకు అనుగుణంగా వివిధ ప్రభుత్వ పథకాలను పొందొచ్చు.2024 అక్టోబర్​ 21న మంత్రిత్వ శాఖ అసంఘటిత కార్మికుల కోసం ‘వన్​ స్టాప్​ సోల్యూషన్​’ అనే ఈ శ్రమ్​ ను కూడా ప్రారంభించింది. ఇది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ఆయుష్మాన్​ భారత్​, ఎంజీఎన్​ఆర్​ఈజీఎ లాంటి 12 కేంద్ర ప్రభుత్వ పథకాలను ఏకీకృతం చేసింది. దీంతో కార్మికులకు సామాజిక, ఆర్థిక, ఆరోగ్య భద్రత లభిస్తుంది.