గ్యాంగ్ స్టర్ అమన్ ఎన్ కౌంటర్
ఎన్టీపీసీ ఉన్నతాధికారి హత్య సుపారి ఇతని పనే?

రాంచీ: ఎన్టీపీసీ ఉన్నతాధికారి హత్య కేసులో ప్రధాన నిందితుడుగా భావిస్తున్న గ్యాంగ్ స్టర్ అమన్ సాహు ఎన్ కౌంటర్ అయ్యాడు. మంగళవారం ఉదయం చత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ జైలు నుంచి ఝార్ఖండ్ లోని రాంచీ జైలుకు తరలిస్తుండగా తప్పించుకునేందుకు ప్రయత్నించడమే గాక పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు. ఒక జవాన్ కు గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు అమన్ ను ఎన్ కౌంటర్ చేశారు. ఇతనిపై వందకుపైగా కేసులున్నట్లు అధికారులు వివరించారు. దొంగతనాలు, దోపిడీలు, కిడ్నాప్ లు, హత్యలు, బెదిరింపుల వంటి కేసులున్నాయి. పలు కేసుల్లో శిక్ష పడడంతో రాయ్ పూర్ జైలులో శిక్ష అనుభవిస్తూనే కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఎన్టీపీసీ ఉన్నతాధికారి హత్య సుపారి కూడా ఇతనే తీసుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా విచారించాలనే రాంచీకి తీసుకువస్తుండగా గ్యాంగ్ స్టర్ అమర్ సాహు తప్పించుకునే క్రమంలో ఎన్ కౌంటర్ లో మృతి చెందాడు. కాగా ఎన్ కౌంటర్ లో ఝార్ఖండ్ రాష్ర్ట ప్రభుత్వం ప్రత్యేక విచారణకు ఆదేశించింది.