కేజ్రీవాల్​ పై ఎఫ్​ ఐఆర్​ నమోదు

పోలీసులకు రౌస్​ అవెన్యూ కోర్టు ఆదేశం

Mar 11, 2025 - 18:03
 0
కేజ్రీవాల్​ పై ఎఫ్​ ఐఆర్​ నమోదు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఆప్​ అధినేత అరవింద్​ కేజ్రీవాల్​ కు మరో షాక్​ తగిలింది. 2019లో కోర్టులో దాఖలైన ఫిర్యాదుపై ఎఫ్​ ఐఆర్​ నమోదు చేయాలని ఢిల్లీలోని రౌస్​ అవెన్యూ కోర్టు మంగళవారం ఆదేశించింది. దీంతో కేజ్రీవాల్​ కు మరిన్ని కష్టాలు చుట్టుముట్టనున్నాయి. ఆప్​ మాజీ ఎమ్మెల్యే గులాబ్​ సింగ్​, ద్వారక మాజీ కౌన్సిలర్​ నితికా శర్మ ఢిల్లీలోని వివిధ ప్రదేశాలలో పెద్ద హోర్డింగ్​ లు ఏర్పాటు చేయడం ద్వారా ఉద్దేశ్యపూర్వకంగానే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. వీళ్లందరిపై ఎఫ్​ ఐఆర్​ నమోదు చేయాలని ఫిర్యాదులో డిమాండ్​ చేశారు. ఫిర్యాదును స్వీకరించిన కోర్టు మార్చి 18లోగా కోర్టు ఆదేశాల అమలుపై నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించారు.