బస్సు బోల్తా 12 మంది మృతి!

12 people killed in bus overturn!

Mar 11, 2025 - 16:32
 0
బస్సు బోల్తా 12 మంది మృతి!

కేప్​ టౌన్​: దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం హైవేపై బస్సు బోల్తా పడి 12 మంది మృతి చెందగా, 45 మందికి తీవ్ర గాయాలయ్యాయి. జోహన్నెస్​ బర్గ్​ లోని హైవేపై ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు వివరించారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు రెస్క్యూబృందాలు రంగంలోకి దిగి బస్సులో చిక్కుకున్న వారిని బయటికి తీసి స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ బస్సు జోహెన్నెస్​ బర్గ్​, కాట్లెహాంగ్​ నుంచి ప్రయాణికులను తీసుకొని వెళుతుండగా వేగంపై నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం చోటు చేసుకుందని పోలీసుల దర్యాప్తులో తేలింది.