హక్కుల కోసం బీఎల్ఎ పోరాటమా?
Is the BLA fighting for rights?

నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: భారత్–పాక్ విభజన తరువాత తమ ప్రాంతాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించాలని బలూచిస్థాన్ లోని ప్రజలు డిమాండ్ చేశారు. కానీ అందుకు పాక్ ప్రభుత్వం ఒప్పుకోలేదు. బలవంతంగా ఆ ప్రాంతాన్ని పాక్ లో చేర్చుకుంది. దీంతో బలూచ్ తిరుగుబాటుకు దిగింది. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ 1970లోనే స్థాపించినప్పటికీ, 2000వరకు పెద్దగా ప్రాబల్యం దక్కలేదు. పాక్, బ్రిటన్, అమెరికా లాంటి దేశాలు బీఎల్ ఎను ఉగ్రసంస్థగా ప్రకటించాయి. 1973లో జుల్ఫీకార్ అలీ భుట్టో భారత్, ఇరాక్, ఆఫ్ఘానిస్థాన్, రష్యాలు బీఎల్ ఎకు మద్ధతు ఇస్తున్నాయని ఆరోపించారు. 2000 సంవత్సరంలో బీఎల్ ఎ కొత్త రూపును సంతరించుకొని మరోమారు స్వాతంత్ర్యం కోసం పోరాటం, ప్రజా హక్కులను కాపాడేందుకు ఉద్భవించినట్లు ప్రకటించింది. ఆ తరువాతే బీఎల్ ఎ దాడులు తీవ్రతరం అయ్యాయి. బలూచ్ వనరులను పాక్ వినియోగించుకుంటూ తమకు మౌలిక సదుపాయాల కల్పన, హక్కుల కల్పనలో విస్మరిస్తున్నారని ఆరోపిస్తుంది. పైగా తమను రెండో ప్రాధాన్యత అంశంగా చూస్తున్నారని మండిపడుతుంది. ఈ నేపథ్యంలో తరచూ పాక్ సైన్యం, ప్రాంతాలలో బీఎల్ ఎ భారీ దాడులకు పాల్పడుతూ తమ ప్రాబల్యాన్ని చాటుకుంటుంది. ఇప్పటికే గ్లోబల్ టెర్రరిస్ట్ దేశాల్లో పాక్ రెండో వరుసలో ఉంది. పాక్ లోని 90 శాతం ఉగ్ర ఘటనలు ఖైబర్ ఫంక్తుక్వా, బలూచిస్థాన్ లోనే జరిగాయి. ఏది ఏమైనా పాక్ ఉగ్రవాద గ్రూపులకు స్వర్గధామంగా మరోమారు నిలిచింది.