బడ్జెట్ కు ముందు శ్వేతపత్రం విడుదలకు డిమాండ్
కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర

బెంగళూరు: రాష్ట్ర బడ్జెట్ ను విడుదల చేసేముందు కర్ణాటక ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర డిమాండ్ చేశారు. ఈ అంశంపై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మార్చి 7న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు సీఎం సిద్ధరామయ్య శ్వేతపత్రం సమర్పించాలన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశలో లేదన్నారు. ఆర్థిక భారంతో సతమతం అవుతూ రాష్ట్రాన్ని దివాలా దిశయగా పయనింపచేస్తుందని ఆరోపించారు. ప్రతీ ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్, ప్రతీ మహిళకు రూ. 2వేలు, బీపీఎల్ కుటుంబానికి ఒక్కరికి పదికిలోల బియ్యం హామీలు నీటిమూటలుగానే మిగిలాయని ఆరోపించారు. అమలుకు చేతగానీ హామీలు ఎందుకిచ్చారని సిఎం సిద్ధరామయ్యను నిలదీశారు.