కుప్పకూలిన మిరాజ్​–2000

ఇద్దరు పైలెట్లకు గాయాలు

Feb 6, 2025 - 17:36
 0
కుప్పకూలిన మిరాజ్​–2000

భోపాల్​: మధ్యప్రదేశ్​ లోని శివపురిలో వైమానిక దళ యుద్ధ విమానం కూలిపోయింది. గురువారం మధ్యాహ్నం బహ్రెటా గ్రామానికి సమీపంలో మిరాజ్​–2000 యుద్ధవిమానం కూలింది. విమానంలో ఉన్న ఇద్దరు పైలెట్లు ప్రమాదానికి ముందే స్వల్పగాయాలతో బయటపడ్డారు. గ్వాలియర్​ శిక్షణ ప్రాంతం నుంచి వైమానిక దళానికి చెందిన మూడు యుద్ధ విమానాలు బయలుదేరగా రెండు సురక్షితంగా తిరిగి వచ్చాయి. మిరాజ్​–2000 సాంకేతిక సమస్య వల్ల ప్రమాదానికి గురైంది. గాయాలైన పైలెట్లను గ్వాలియర్​ కు తరలించి చికిత్సనందిస్తున్నారు. అధికారుల బృందం సంఘటనా స్థలానికి చేరుకొని విమానం కూలిపోయేందుకు గల కారణాలను అన్వేషిస్తుంది. 

స్థానిక ఎస్పీ సంజీవ్​ ములే..

మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో గ్రామస్తులు విమాన ప్రమాదం గురించి సమాచారం అందించారు. వెంటనే తన బృందంతో సంఘటనా స్థలానికి చేరుకొని విమానంలో చెలరేగుతున్న మంటలను ఆర్పాము. గాయపడిన పైలెట్లను చికిత్స నిమిత్తం గ్వాలియర్​ కు తరలించాము. ప్రమాద విషయంపై గ్వాలియర్​ వైమానిక దళ ఉన్నతాధికారులతో సమాచారాన్ని పంచుకున్నాం. విమానం పొలాల్లో కూలడంతో పెను ప్రమాదం తప్పింది.