కేదార్ నాథ్, హేమకుండ్ రోప్ వేలకు కేబినెట్ ఆమోదం
Cabinet approval for Kedarnath and Hemakund rope auction

రూ.4,081 కోట్లు, రూ.2,730 కోట్ల వ్యయం
వివరాలు వెల్లడించిన కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: పర్వతమాల ప్రాజెక్టు కింద సోన్ ప్రయాగ్ నుంచి కేదార్ నాథ్ 12.9 కి.మీ.వరకు, చమోలీలో హేమకుండ్ సాహిబ్ గోవింద్ ఘాట్ 12.4కి.మీ. రోప్ వేలు నిర్మించనున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. బుధవారం కేంద్ర కేబినెట్ ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలోని నిర్ణయాన్ని మీడియాకు వెల్లడించారు. రోప్ వేల ప్రాజెక్టులకు రూ. 4,081 కోట్లు, రూ. 2,730 కోట్లు ఖర్చవుతుందన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తి అయితే 8 నుంచి 9 గంటలు పట్టే ప్రయాణ సమయం కేవలం 36 నిమిషాలకు తగ్గుతుందన్నారు. ఇందులో 36 మంది కూర్చునే సామర్థ్యం ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్టు డీబీఎఫ్ వోట మోడ్ 3 ఎస్ సాంకేతిక వ్యవస్థతో అభివృద్ధి చేస్తామని వివరించారు. కేదార్ నాథ్ రోప్ వే ద్వారా గంటకు 1800మందిని గమ్యస్థానాలకు చేరుస్తాన్నారు. రోజుకు 18వేల మంది ప్రయాణించవచ్చని తెలిపారు. అదే సమయంలో గోవింద్ ఘాట్ ఏటా రెండు లక్షల మంది వస్తారన్నారు. దీంతో కొండ ప్రాంతంలో ఆసుపత్రులు, హోటళ్లు, మౌలిక సదుపాయాల కల్పన తదితరాలు పెరుగుతాయన్నారు. రోప్ వే ప్రాజెక్టులు వేగవంతమైన అభివృద్ధిలో ముఖ్యమైన అడుగన్నారు. దీంతో కేదార్ నాథ్ ఆలయం సందర్శన సులభతరం అవుతుందని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టులకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సీసీఇఎ ఆమోదం తెలిపిందన్నారు.
ఎల్ హెచ్ డీసీపీకి రూ. 3,880 కేటాయింపు..
2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎల్ హెచ్ డీసీపీ (లైవ్ స్టాక్ హెల్త్ అండ్ డిసిజ్ కంట్రోల్ ప్రోగ్రామ్) కేబినెట్ రూ. 3,880 కోట్లను కేటాయించారు. దీంతో పశువులు కలిగిన రైతులకు లాభం చేకూరనుంది. పశుసంవర్ధక శాఖ ద్వారా పశువైద్యానికి ఈ నిధులను వినియోగించనున్నారు. పశువులకు సంక్రమిస్తున్న పలు రోగాలను నయం చేసేందుకు సరసమైన ధరల్లో జనరిక్ పశువైద్య మందులను అందుబాటులో ఉంచనున్నారు. వ్యాధుల నివారణ, చికిత్స, పశుపోషణను పెంపొందించడమే లక్ష్యంగా నిధులను కేటాయించినట్లు అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.