చత్తీస్​ గఢ్​ లో బర్డ్​ ఫ్లూ కలకలం.. 15వేల కోళ్లు మృతి

Bird flu outbreak in Chattisgarh.. 15 thousand chickens died

Feb 2, 2025 - 13:28
 0
చత్తీస్​ గఢ్​ లో బర్డ్​ ఫ్లూ కలకలం.. 15వేల కోళ్లు మృతి

రాయ్​ పూర్​: చత్తీస్​ గఢ్​ లోని రాయ్​ గఢ్​ లో బర్డ్​ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న కోళ్ల ఫారంలో 15వేలు పైగా కోళ్లకు బర్డ్​ ఫ్లూ వైరస్​ సోకి మృతి చెందాయి. కోళ్లతోపాటు 26,300 గుడ్లు, 712 క్వింటాళ్ల దాణాను పాతిపెట్టారు. దీంతో స్థానికంగా ఉన్న ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. కాగా చనిపోయిన కోళ్లకు భోపాల్​ నేషనల్​ ఇన్​ స్టిట్యూట్​ ఆఫ్​ హై సెక్యూరిటీ యానిమల్​ డిసీజెస్​ కు చెందిన ల్యాబక్​ కు పంపి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో హెచ్​5ఎన్​1 సోకినట్లు నిర్దారణ అయ్యింది. బర్డ్​ ఫ్లూపై రాయ్​ గఢ్​ కలెక్టర్​ కార్తీకేయ ఆదివారం మీడియాతో మాట్లాడారు. బర్డ్​ ఫ్లో సోకినట్లు నిర్ధారించామని విస్తరించకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. పౌల్ట్రీ ఫారం ప్రాంగణంలో క్రిమి సంహారక చర్యలు చేపట్టినట్లు వివరించారు.