అమెరికా దిగుమతులపై 25 శాతం సుంకాలు!
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో

సమస్యల పరిష్కారానికి పొరుగుదేశాలతో చర్చిస్తాం: మెక్సికో అధ్యక్షురాలు షీన్ బామ్..
ఒట్టావా: యూఎస్ అధ్యక్షుడు అమెరికా ట్రంప్ ప్రకటనపై కెనడా గుర్రుగా ఉంది. అమెరికాకు చెందిన దిగుమతులపై 25 శాతం సుంకాలు విధించనున్నట్లు ఆ దేశ ప్రధాని ట్రోడో చెప్పారు. 155 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై ఈ సుంకం విధిస్తామని ప్రకటించారు. మరోవైపు, మెక్సికన్ అధ్యక్షురాలు క్లాడియా షీన్ బామ్ మాట్లాడుతూ.. ఇరుదేశాలు ఒకరిపై మరొకరు సుంకాలు విధించుకోవడం వల్ల సమస్యలు పరిష్కారం కావన్నారు. పొరుగుదేశాలతో చర్చిస్తామన్నారు. మంగళవారం (ఫిబ్రవరి4) నుంచి 30 బిలియన్ వస్తువులపై ఈ టారిఫ్ ను అమలు చేస్తామన్నారు. రానున్న రోజుల్లో 125 బిలియన్ వస్తువులపై మరిన్ని టారిఫ్ లు విధిస్తామన్నారు. తాను సన్నిహితులు, పొరుగువారితో నేరుగా మాట్లాడాలని అనుకుంటున్నట్లు అమెరికా పేరు తీయకుండానే చెప్పారు. సుంకాలు విధించడం కెనడాకు హాని కలిగించే భారీ నుంచి తప్పిస్తామన్నారు. ఈ పరిణామాలు అమెరికాలోని ఉద్యోగులను కూడా ప్రమాదంలోకి నెడతాయన్నది గుర్తెరగాలన్నారు. ట్రంప్ అమెరికాలో స్వర్ణయుగంగా తీర్చిదిద్దాలనుకుంటే కెనడాతో భాగస్వామ్యం అత్యంత కీలకమని గుర్తించాలని, అదే సమయంలో కెనడాపై సుంకాల ప్రకటనను వెంటనే ఉపసంహరించుకొని చర్చలు జరుపుదామన్నారు.
మెక్సికో అధ్యక్షురాలు షీనాబామ్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలు, క్రిమినల్ చర్యలలో మెక్సికోకు ఎటువంటి సంబంధం లేదన్నారు. పరస్పర విశ్వాసం, నమ్మకం, సహకారంతో ముందుకు నడవాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే ప్రజాప్రయోజనాల ఆకాంక్షల మేరకు పరిపాలన సాధ్యపడుతుందన్నారు.
ట్రంప్ కెనడా, మెక్సికో, చైనా దేశాలపై వందకు వంద శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించిన నేపథ్యంలో కెనడా, మెక్సికోల నుంచి ఈ ప్రతిక్రియ విడుదలైంది.