బంగ్లా మైనార్టీలపై దాడులు

Attacks on Bangla Minorities

Feb 18, 2025 - 11:54
 0
బంగ్లా మైనార్టీలపై దాడులు

బంగ్లాదేశ్​ హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్యతా మండలి నివేదిక

ఢాకా: బంగ్లాదేశ్​ అల్లర్లలో 32 మంది హిందువులు హత్యకు గురి కాగా, 13 మందిపై లైంగికదాడులు, 133 దేవాలయాలు ధ్వంసమైనట్లు మైనార్టీ సంస్థ నివేదికలో వెల్లడైంది. బంగ్లాదేశ్​ హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్యతా మండలి నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. షేక్​ హసీనా ప్రభుత్వం కూలిపోయాక మైనార్టీలే లక్ష్యంగా దాడులు కొనసాగినట్లు పేర్కొన్నారు. శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలాయి. దీంతో పలు విధ్వంసకర ముఠాలు, ఉగ్ర గ్రూపులు మైనార్టీలను టార్గెట్​ గా చేసుకున్నారు. ఐదు నెలలపాటు మైనార్టీలపై వీరి విధ్వంసకాండ కొనసాగింది. 2010 తరువాత ఇంతపెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగడం 2024లోనే జరిగింది. 2010లో జరిగిన అల్లర్లలో 1769 కేసులు నమోదయ్యాయి. 2024 నుంచి 2025 జనవరి 11 వరకు 1415 కేసులు నమోదయ్యాయి. డిసెంబర్​ 10 నాటికి మైనార్టీలపై దాడుల కేసుల్లో 70 మందిని అరెస్టు చేశారు. కేసులు, నష్టపరిహారాలకు సంబంధించిన విషయాలను కూడా బంగ్లాదేశ్​ హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్యతా మండలి చూసుకుంటుంది. నష్టపోయిన బాధితులకు పూర్తి అండగా నిలుస్తుంది.

తొలుత 15 రోజుల్లో జరిగిన దాడులు..
9 హత్యలు, 69 దేవాలయాలు ధ్వంసం, నాలుగు లైంగికదాడులు, 915 ఇళ్లపై దాడులు, 953 దుకాణాలు ధ్వంసం, ఒక ఇంటిని పూర్తిగా తగులబెట్టారు, మైనార్టీలపై 38 దాడులు జరిగాయి. 

ఆగస్ట్​ 20 తరువాత నాలుగు నెలల్లో దాడులు..
23 హత్యలు, 9 సామూహిక లైంగికదాడులు, 64 ప్రార్థనాలయాలు ధ్వంసం, 15 మంది మైనార్టీల అరెస్ట్​ చేసి హింసకు గురి చేశారు. 38 మైనార్టీల దుకాణాలు ధ్వంసం చేశారు. 25 ప్రాంతాల్లోని వ్యవసాయ పొలాలను కబ్జా చేశారు. మొత్తం 174 ఘటనలు జరగ్గా ప్రభుత్వం 9 కేసులు మాత్రమే నమోదు చేసింది. 

బంగ్లాదేశ్​ హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్యతా మండలి బంగ్లాదేశ్​ లోని అల్లర్లు జరిగిన ఠాకూర్​ గావ్​, లాల్​ మోనిహార్​ హట్​, దినాజ్​ పర్​, రంగ్​ పూర్​, సిల్హాట్​, కుల్నా ప్రాంతాల్లో సర్వే జరిపి నివేదికను వెల్లడించింది. కాగా 2024లో మొత్తం భద్రతా దళాలు, దాడుల కారణంగా దేశవ్యాప్తంగా 1400మంది మృతి చెందినట్లు ఐక్యరాజ్యసమితికి భారత్​ తెలిపింది.