భారత్–ఖతార్ మధ్య లోతైన బంధాలు
Deep ties between India and Qatar

ప్రధాని మోదీ, రాష్ర్టపతి ముర్మూలతో ఖతార్ షేక్ తమీమ్ భేటీ
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ భారత్–ఖతార్ మధ్య నమ్మకం, మరింత లోతైన చారిత్రక సంబంధాలు అవసరమని ఇరుదేశాల విదేశాంగ శాఖలు పేర్కొన్నాయి. సోమవారం రాత్రి భారత్ కు వచ్చిన ఖతార్ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీకి ప్రధాని నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు. మంగళవారం ఉదయం ప్రధాని మోదీ, రాష్ర్టపతి ద్రౌపదీ మూర్ములు షేక్ తమీమ్ ను రాష్ర్టపతి భవన్ లో స్వాగతించారు. ఇటీవలి సంవత్సరాలలో రెండు దేశాల మధ్య సంబంధాలు - ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడి, ఇంధనం, సాంకేతికత, సంస్కృతి, పీ2పీ (ప్రజల నుంచి ప్రజలు) సంబంధాలు బలోపేతం అయ్యాయి. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు షేక్ తమీమ్ భారత్ లో పర్యటించడం ఇది రెండోసారి. రాష్ర్టపతి భవన్ లో పలువురు మంత్రులు,ప్రతినిధులను షేక్ తమీమ్ కలిశారు. మధ్యాహ్నం హైదరాబాద్ హౌస్ లో ప్రధానితో ద్వైపాక్షిక సమావేశం, అనంతరం ఎంవోలపై సంతకాలు చేయనున్నారు. సాయంత్రం 7 గంటలకు రాష్ర్టపతి భవన్ లో మరోమారు ద్రౌపదీ ముర్మూతో కలిసి గౌరవార్థం ఇచ్చే విందులో పాల్గొంటారు. అనంతరం ఖతార్ వెళ్లనున్నారు.