గొగోయ్ ఐఎస్ఐ బంధంపై విచారణ
సీఎం హిమంత బిశ్వ శర్మ

డీస్ఫూర్: కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ కు ఐఎస్ఐతో ఉన్న సంబంధాలపై అసోం ప్రభుత్వం దర్యాప్తు చేపడుతుందని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడారు. బీజేపీపై ఎంపీ గొగోయ్ చేసిన విమర్శలు, ఆరోపణలపై సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై చట్టబద్ధంగా ఎదుర్కొంటామన్నారు. తాను పదవిలో ఉన్నంతకాలం దేశ భద్రతను కాపాడతానని ప్రమాణం చేశానని చెప్పారు. అందువల్ల ఎంపీ గౌరవ్ గొగోయ్ దేశ వ్యతిరేక చర్యలు, బీజేపీపై అనుచిత వ్యాఖ్యలపై చర్యలుంటాయన్నారు. గతంలో ఈ అంశంపై మాట్లాడుతూ ఎంపీ భార్యకు పాక్ ఐఎస్ఐ, జార్జ్ సోరోస్ సంస్థలతో సంబంధాలున్నాయన్నారు. ఈ మొత్తం విషయాలపై సిట్ ఏర్పాటు చేస్తామని సీఎం శర్మ స్పష్టం చేశారు.