అసెంబ్లీ నుంచి అబూ సస్పెండ్​

Abu suspended from assembly

Mar 5, 2025 - 13:56
 0
అసెంబ్లీ నుంచి అబూ సస్పెండ్​

పలు సెక్షన్ల కింద కేసు నమోదు
ఔరంగజేబుపై అనుచిత వ్యాఖ్యల దుమారం

ముంబాయి: ఔరంగజేబుపై ప్రేమను చాటుకున్న ఎస్పీ ఎమ్మెల్యే అబూ అజ్మీపై మహారాష్ర్ట అసెంబ్లీ ముగిసే వరకు నిషేధం (సస్పెండ్​) విధించారు. బుధవారం ఆయన్ను బడ్జెట్​ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్​ చేస్తున్నట్లు స్పీకర్​ ప్రకటించారు. కాగా అజ్మీ వ్యాఖ్యలపై మహారాష్ర్టలోనే గాక దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగుతుంది. ఈ అనుచిత వ్యాఖ్యలపై భారత శిక్షాస్మృతిఓని 299, 356 (1), 356(2), 302 సెక్షన్ల కింద ముంబాయిలో కేసులు కూడా నమోదయ్యాయి. తన వ్యాఖ్యలపై పెరుగుతున్న వ్యతిరేకతను గమనించిన ఆజ్మీ క్షమాపణ చెప్పాడు అబూ అజ్మీ ఎస్పీ ముంబాయిలోని మంఖుర్ద్​ శివాజీనగర్​ నియోజకవర్గం ఎమ్మెల్యే. ఈయన సస్పెన్షన్​ పై ఎస్పీ ఎమ్మెల్యే షేక్​ అసెంబ్లీ స్పీకర్​ ను కలవనున్నారు. వ్యాఖ్యలపై చట్టపరమైన అభిప్రాయం తీసుకుంటామని చెప్పారు. 
అబూ వ్యాఖ్యలు..
ఔరంగజేబు అనేక దేవాలయాలను నిర్మించాడు. పండితులు ఔరంగజేబు కోసం ఒక మసీదు నిర్మించి ఇచ్చారని, అతని పాలనలో భారత జీడీపీ 24 శాతంగా ఉండేదని ఇలా అనేక రకాల వ్యాఖ్యలు చేశాడు.