కుంభమేళా @ 59 కోట్లు!

Kumbh Mela @ 59 Crores!

Feb 22, 2025 - 16:08
 0
కుంభమేళా @ 59 కోట్లు!

లక్నో: మహాకుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తుల సంఖ్య శనివారం మధ్యాహ్నానికి 59 కోట్లకు చేరుకుంది. పుష్కరాలు మొదలై 41 రోజులు గడుస్తున్నా ఏ మాత్రం భక్తుల సంఖ్య తగ్గడం లేదు. ఇంకా నాలుగురోజులే మిగిలి ఉండడం, వారాంతం రోజులు కావడంతో భారీ ఎత్తున భక్తులు ప్రయాగ్​ రాజ్​ కు చేరుకుంటున్నారు. దీంతో ప్రయాగ్​ రాజ్​ వ్యాప్తంగా భారీ ట్రాఫిక్​ జామ్​ ఏర్పడింది. యుమునా నదిపై ఏడు గంటలుగా ట్రాఫిక్​ స్తంభించింది. షటిల్​ బస్సులు కూడా ట్రాఫిక్​ లో చిక్కుకున్నాయి. దీంతో అరగంట ప్రయాణానికి నాలుగు గంటలు పడుతుందని పలువురు ప్రయాణికులు వాపోతున్నారు. కాగా ఏడు ఎంట్రీ పాయింట్ల వద్దే బయటి వాహనాలను నిలిపివేస్తున్నారు. నగరం వెలుపలే పార్కింగ్​ ఏర్పాటు చేశారు. ప్రయాగ్​ రాజ్​ కు దారితీసే 8 రహదారుల్లో 10 నుంచి 12 కి.మీ. మేర నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి. అయితే భక్తుల సౌకర్యార్థం చిన్నవాహనాలను అనుమతిస్తున్నారు. వీటితోపాటు బైకర్లు ప్రయాణికులను త్రివేణి సంగమం వద్దకు తీసుకువెళతున్నారు.