వారసత్వంపై ఏఎస్ ఐ సర్వే
ASI Survey on Inheritance

గాంధీనగర్: ద్వారక తీరంలో మునిగిపోయిన వారసత్వాన్ని వెలికితీసేందుకు ఏఎస్ఐ (పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా) గుజరాత్ తీరంలో అన్వేషణ ప్రారంభించింది. మంగళవారం ప్రారంభించిన అన్వేషణ బుధవారం కూడా మరింత మంది డైవర్లతో అన్వేషించారు. గోమతీ క్రీక్ సమీపంలో అదనపు డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ అలోక్ త్రిపాఠి నేతృత్వంలో ఐదుగురు శాస్ర్తవేత్తల బృందం అన్వేషనను కొనసాగిస్తుంది. అన్వేషణ బృందంలో హెచ్కె నాయక్, అసిస్టెంట్ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ అపరాజిత శర్మ, పూనమ్ వింద్, రాజకుమారి బార్బినా ఉన్నారు. ఏఎస్ ఐ సముద్ర అట్టడుగున అన్వేషణలో మహిళా అధికారులు కూడా పాల్గొనడం ఇదే తొలిసారి. ద్వారాక, బెట్ ద్వారక ప్రాంతాలలో సర్వే కొనసాగుతుంది. 1980లో సముద్రపు అడుగున చేపట్టిన అన్వేషణలో కీలక ఫలితాలను, పలు ఆధారాలను సాధించింది. ఈ నేపథ్యంలో లక్ష్యద్వీప్, తమిళనాడు, మణిపూర్, ఎలిఫెంటా ద్వీపం వంటి ప్రదేశాలలో అప్పట్లు అన్వేషణ నిర్వహించారు. 2005, 2007 ఏఎస్ఐ నిర్వహించిన సర్వేలో సముద్రంలో పలు శిల్పాలను గుర్తించారు.