బాలాఘాట్​ లో ఎన్​ కౌంటర్​ ముగ్గురు మహిళా నక్సలైట్లు మృతి

Three women Naxalites killed in encounter in Balaghat

Feb 19, 2025 - 16:38
 0
బాలాఘాట్​ లో ఎన్​ కౌంటర్​ ముగ్గురు మహిళా నక్సలైట్లు మృతి

భోపాల్​: మధ్యప్రదేశ్​ బాలాఘాట్​ లో పోలీసులతో జరిగిన ఎన్​ కౌంటర్​ లో ముగ్గురు మహిళా నక్సలైట్లు మృతి చెందారు. బుధవారం చత్తీస్​ గఢ్​ సరిహద్దుకు సమీపంలోని అటవీ ప్రాంతంలో యాంటీనక్సల్స్​ హాక్​ ఫోర్స్​ ఆపరేషన్​ లో వీరిని మట్టుబెట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ ఎన్​ కౌంటర్​ లో స్థానిక పోలీసు బృందాలు కూడా పాల్గొన్నాయని అడిషనల్​ పోలీస్​ కమిషనర్​ విజయ్​ దాబర్​ తెలిపారు. జిల్లా ప్రధాన కార్యాలయానికి 9‌‌0 కి.మీ. దూరంలో ఈ కాల్పులు జరిగినట్లు తెలిపారు. నక్సల్స్​ నుంచి పలు ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కూంబింగ్​ ఇంకా కొనసాగుతుందన్నారు.