బడ్జెట్ లో మైనార్టీలకు పెద్ద‘పీట’
A big 'seat' for minorities in the budget

ముస్లింలీగ్ బడ్జెట్ అన్న బీజేపీ
కర్ణాటక బడ్జెట్ విడుదల చేసిన సీఎం సిద్ధరామయ్య
బెంగళూరు: కర్ణాటక బడ్జెట్ లో మైనార్టీలకు సీఎం సిద్ధరామయ్య అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. శుక్రవారం రాష్ర్ట బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ పూర్తిగా ‘ముస్లింలీగ్’ బడ్జెట్ అని బీజేపీ ఆరోపణలు, విమర్శలు గుప్పించింది.
బడ్జెట్ లో కేటాయింపులు..
– వక్ఫ్ భూమి, శ్మశాన వాటికల పరిరక్షణ, నిర్వహణ కోసం రూ.150 కోట్లు కేటాయింపు.
– సీఎం మైనారిటీ కాలనీ అభివృద్ధి కార్యక్రమం కింద 25–-26 ఆర్థిక సంవత్సరంలో రూ.1000 కోట్లతో కార్యాచరణ ప్రణాళిక అమలు చేయబడుతుంది.
– ఆర్థికంగా బలహీనమైన మైనారిటీల వివాహాలకు ప్రతి జంటకు రూ. 50,000 సహాయం.
– హజ్ భవన్ కాంప్లెక్స్లో మరో భవన నిర్మాణం.
– 250 మౌలానా ఆజాద్ మోడల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ నుంచి పీయూ వరకు తరగతులు దశలవారీగా ప్రారంభం. రూ. 500 కోట్లు. ప్రస్తుత సంవత్సరం రూ. 100 కోట్లు కేటాయింపు.
– మదర్సాలలో మతపరమైన విద్యతో పాటు అధికారిక విద్యను అందించడానికి, ఎన్ ఐఓఎస్ ద్వారా విద్యార్థులను ఎస్ఎస్ఎల్పీ పరీక్ష రాయడానికి సిద్ధం చేయడానికి కంప్యూటర్లు, స్మార్ట్ బోర్డులు, ఇతర అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన.
– కర్ణాటక మైనారిటీల అభివృద్ధి సంస్థ ద్వారా మైనారిటీ యువత కొత్త స్టార్టప్లను ప్రారంభించడానికి ప్రోత్సాహం.
– ముఖ్యమంత్రి మైనారిటీ కాలనీ అభివృద్ధి కార్యక్రమం కింద రూ.1,000 కోట్లతో కార్యాచరణ ప్రణాళిక. 2025–-26లోనే పనుల నిర్వహణ.
– జైన పూజారులు, సిక్కుల ప్రధాన గురువులు, మసీదుల పేష్-ఇమామ్లకు గౌరవ వేతనం నెలకు రూ.6,000కు పెంపు.
– మైనారిటీ వర్గాల సాంస్కృతిక, సామాజిక కార్యకలాపాలను నిర్వహించడానికి రాష్ట్రవ్యాప్తంగా బహుళార్ధసాధక మందిరాలు నిర్మించబడతాయి. హూబ్లీ తాలూకా స్థాయిలో రూ.50 లక్షలతో, జిల్లా ప్రధాన కార్యాలయాలు, మునిసిపల్ కార్పొరేషన్ ప్రాంతాలలో కోటి రూపాయలతో భవనాల నిర్మాణం.
– కలబురగి జిల్లాలోని చిత్తపుర తాలూకాలోని పురాతన బౌద్ధ కేంద్రమైన సన్నతిలో అభివృద్ధి అథారిటీ ఏర్పాటు.
– ఐదు ప్రభుత్వ హామీల కొనసాగింపునకు రూ. 51,034 కోట్ల కేటాయింపు.
మండిపడ్డ బీజేపీ..
కర్ణాటక బడ్జెట్ పై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి మండిపడ్డారు. ఇది ప్రజలు మెచ్చిన బడ్జెట్ కాదని ‘ముస్లింలీగ్ బడ్జెట్’ అని ఆరోపించారు. ఇమామ్ లకు వేతనాలు, వక్ఫ్ కు కేటాయింపులు, మైనార్టీలకు కేటాయింపులు చేస్తూ పాక్ లోని జిన్నా ప్రభుత్వాన్ని తలపించేలా బడ్జెట్ లో కేటాయింపులు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ రాజ్యాంగ విలువలను కాలరాయడమేనన్నారు.