జై పాలస్తీనా నినాదాలు.. ఎంపీ అసద్​ కు బరేలీ కోర్టు నోటీసులు

Jai Palestine slogans.. Bareli court notices to MP Asad

Dec 24, 2024 - 17:28
 0
జై పాలస్తీనా నినాదాలు.. ఎంపీ అసద్​ కు బరేలీ కోర్టు నోటీసులు

జనవరి 7న విచారణకు హాజరు కావాలని ఆదేశం

బరేలీ: పార్లమెంట్​ లో ఎంపీ పదవీ ప్రమాణ స్వీకారం సందర్భంగా జై పాలస్తీనా నినాదం చేసిన హైదరాబాద్​ ఎంపీ, ఎఐఎంఐఎం అధ్యక్షుడు ఓవైసీకి బరేలీ కోర్టు జనవరి 7న విచారణకు హాజరుకావాలని సమన్లను పంపింది. వీరేంద్ర గుప్తా అనే న్యాయవాది ఓవైసీ నినాదంపై బరేలీలో పిటిషన్​ దాఖలు చేశారు. ఈ పిటిషన్​ ను కోర్టు మంగళవారం విచారించింది. ఎంపీ ఎమ్మెల్యే కోర్టులో అసద్​ పిటిషన్​ దాఖలు చేసినా దాన్ని తిరస్కరించారని, అనంతరం జిల్లా జడ్జి కోర్టులో రివిజన్​ పిటిషన్​ దాఖలు చేశారని న్యాయవాది వీరేంద్ర గుప్తా పేర్కొన్నారు. పిటిషన్​ ను కోర్టు స్వీకరించిందన్నారు. జనవరి 7న విచారణకు హాజరు కావాలని ఎంపీకి నోటీసులు జారీ చేసిందని తెలిపారు. గుప్తా దాఖలు చేసిన పిటిషన్​ లో  ఓవైసీ వ్యాఖ్యలు భారత రాజ్యాంగానికి విరుద్ధమని, అవమానకరమని పేర్కొన్నారు. వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎంపీ పార్లమెంట్​ లో ప్రమాణ స్వీకారం అనంతరం జై భీమ్​, జై తెలంగాణ, జై పాలస్తీనా అంటు నినాదాలు చేశారు. అయితే పలు సందర్భంగా కేవలం జై పాలస్తీనా అనే నినాదాలు చేయడమే వివాదాస్పదంగా మారింది.