205 మంది భారతీయులు వెనక్కు!
అమృత్ సర్ కు చేరనున్న అమెరికా సీ–17 విమానం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: అమెరికాలో చట్ట విరుద్ధంగా నివసిస్తున్న 205 మంది భారతీయులను వెనక్కు పంపారు. సోమవారం రాత్రి యూఎస్ వైమానిక దళానికి చెందిన సీ–17 విమానంలో వీరంతా బయలుదేరారు. విమానం మంగళవారం సాయంత్రానికి అమృత్ సర్ కు చేరుకోనుంది. ట్రంప్ అధికారం చేపట్టిన 11 రోజుల్లోనే 25వేల మందికి పైగా అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకొని వారి వారి దేశాలకు పంపుతున్నారు.అక్రమ వలసదారులపై అమెరికాతో సహకరిస్తామని భారత్ కూడా ట్రంప్ వాదనతో ఏకీభవించింది. వీరిని గుర్తించడంలో భారత్ కూడా పాల్గొంది. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఇ) 15 లక్షల మంది అక్రమ వలసదారుల జాబితాను సిద్ధం చేశారు. ఈ జాబితా ప్రకారం 12 రాష్ర్టాల్లో దాడులు నిర్వహించి అక్రమవలసదారులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 18,000 మంది భారతీయులు కూడా ఉన్నారు. ఇప్పటికే 1700మంది భారతీయులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని దశల వారీగా భారత్ కు తిరిగి పంపనున్నారు. మరోవైపు మెక్సికో, కెనడా సరిహద్దుల నుంచి చొరబాట్లు 94 శాతం మేర తగ్గినట్లు అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. బైడెన్ హయాం జనవరి 19 నుంచి ట్రంప్ అధికారం చేపట్టే వరకూ రోజుకు 2087 మంది చొరబాట్లు జరిగినట్లు గుర్తించారు.ప్రస్తుతం ఆ సంఖ్య 126గా ఉందన్నారు. ఒక్క వ్యక్తి కూడా అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించకూడదని ట్రంప్ అధికారులకు స్పష్టం చేశారు.