రిటైర్డ్​ అధికారి కుటుంబంపై ఉగ్రకాల్పులు

  అధికారి మృతి, భార్య, కూతురికి బుల్లెట్​ గాయాలు

Feb 3, 2025 - 18:48
 0
రిటైర్డ్​ అధికారి కుటుంబంపై ఉగ్రకాల్పులు

శ్రీనగర్​: కశ్మీర్​ లో రిటైర్డ్​ లాన్స్​ నాయక్​ మంజూర్​ అహ్మద్​ కుటుంబంపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. సోమవారం కుల్గామ్​ లోని బెహిబాగ్​ ఇంటి నుంచి కారులో బయటకు వెళుతున్న మంజూర్​, భార్య, కూతురిపై అతిదగ్గరగా ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో మంజూర్​ అక్కడికక్కడే మృతి చెందగా, భార్య, కూతురుకు బుల్లెట్​ గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. సోదాలు కొనసాగిస్తున్నారు. గాయపడ్డ మంజూర్​ అహ్మద్​ భార్య, కూతురిని శ్రీనగర్​ ఆసుపత్రికి తరలించి చికిత్సనందింప చేస్తున్నారు. ఆ ప్రాంతంలో హై అలర్ట్​ ప్రకటించారు. రాకపోకలను నిషేధించారు.