గ్రీస్​ లో 200 భూప్రకంపనలు!

200 earthquakes in Greece!

Feb 3, 2025 - 15:17
 0
గ్రీస్​ లో 200 భూప్రకంపనలు!

ఏథెన్స్: గ్రీస్‌లోని శాంటోరిన్ ద్వీపంలో భూకంప ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. శుక్రవారం నుంచి నిరంతరం చోటు చేసుకుంటున్న భూకంపాలు సోమవారం వేకువజాము వరకు కొనసాగాయి. మొత్తం స్వల్ప తీవ్రతతో 200కు పైగా భూకంపాలు మూడు రోజుల్లో వచ్చాయని అధికారులు వివరించారు. దీంతో శాంటోరిన్​ లో అలర్ట్​ ప్రకటించి పాఠశాలలు, కాలేజీలు, వాణిజ్య భవనాల్లో నివసించొద్దని సెలవు ప్రకటించారు. భూకంప తీవ్రత అత్యధికంగా 4.6 రిక్టర్​ స్కేల్​ పై నమోదైనట్లు గుర్తించారు. ఓడరేవులకు దూరం ఉండాలని, సభలు, సమావేశాలను వాయిదా వేసుకోవాలని హెచ్చరించారు. గ్రీస్​ లోని శాంటోరిన్​ ద్వీపం సుందరమైనదిగా పేరొందింది. ఏటా ఇక్కడకు 34 లక్షల మంది వరకు పర్యాటకులు ఈ ద్వీపాన్ని సందర్శించేందుకు వస్తుంటారు. ఈ ద్వీపంలో 20వేలకు పైగా ప్రజలు నివసిస్తున్నారు. భూకంపం సందర్భంగా ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడంతో అధికారులు ఉపిరి పీల్చుకున్నారు. కాగా భూమిలోపల పొరల్లోని టెక్టానిక్​ ప్లేట్స్​ లో కదలికల వల్లే వరుస భూకంపాలకు కారణమని అధికారులు వివరించారు.