రాహుల్ ఆరోపణలు అబద్ధాలే
Union Defense Minister Rajnath Singh

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: రాహుల్ గాంధీ ఆర్మీ చీఫ్ పై తప్పుడు ఆరోపణలు చేస్తూ దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నారని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మండిపడ్డారు. పూర్తి అవాస్తవాలను మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంగళవారం రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై రాజ్ నాథ్ సింగ్ మాట్లాడారు. సరిహద్దులో పెట్రోలింగ్ అంతరాయం గురించి మాత్రమే ప్రస్తావనకు వచ్చాయన్నారు. ఈ ఆటంకాలను ఇరుదేశాలు సమన్వయంతో పరిష్కరించుకుంటాయన్నారు. 1962, 1963లో భారత భూభాగాన్ని కోల్పోయినప్పుడు ఏ ప్రభుత్వాలు మనుగడలో ఉన్నాయని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. ప్రస్తుతం ఆత్మనిర్బర్ భారత్ ప్రపంచం ముందు సాక్షాత్కరించిందన్నారు. రాహుల్, కాంగ్రెస్ పార్టీల ప్రకటనలు దేశ సైనిక శక్తిని నిర్వీర్యం చేసేలా ఉన్నాయని రాజ్ నాథ్ సింగ్ మండిపడ్డారు.