యూఎస్ఎఐడీ బ్రెయిన్ వాష్
USAID brainwash

కుట్రను బయటపెట్టిన వికిలీక్స్
తెరవెనుక యూఎస్ హస్తం!
ఇప్పటికే 75వేలమంది జర్నలిస్టులకు శిక్షణ
వీరి ద్వారా వామపక్ష భావజాలాన్ని ప్రజల్లోకి చొప్పించే యత్నం
ప్రపంచవ్యాప్తంగా 4000 అవుట్ లెట్ లు
భారత్ లో భాగస్వామి డేటాలీడ్స్
సోరోస్ సంస్థలో సభ్యుడు సయ్యద్ నజకత్
పాలంపూర్ లో ప్రశాంత్ భూషణ్ అనుబంధ ఇన్ స్టిట్యూట్లో శిక్షణ
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: జర్నలిజం ముసుగులో ప్రపంచంలోని పలు దేశాల ప్రయోజనాలను దెబ్బతీసే భారీ కుట్రను వికిలీక్స్ బహిర్గతం చేసింది. వామపక్ష భావజాలంతో యూఎస్ ఈ కుట్రలకు తెరతీసింది. యూఎస్ ఎఐడీ (యూనైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్) పేరుతో 75వేల మంది పాత్రికేయులకు శిక్షణ ఇచ్చి వీరి ద్వారా ఆయా దేశాల్లోని ప్రజలను వామపక్ష భావాజాలంలోకి నెట్టే ప్రయత్నాలకు తెరతీసింది. దేశ ప్రజలను తప్పుదోవ పట్టేంచే, వారిని బ్రెయిన్ వాష్ చేసే కుతంత్రాలకు అంకురార్పణ చేసింది. తెరముందు యూఎస్ కనిపించపోయినా వామపక్షజాలం అనువణువునా జీర్ణించుకున్న జార్జ్ సోరోస్, ఇతర సంస్థల ముసుగుల్లో ఈ ప్రయత్నాలు జరిగాయి. దీంతో భారత్ సంస్కృతి, సాంప్రదాయాలు, ప్రజల మనోభావాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. వికిలీక్స్ ప్రకారం వందలాది దేశాల్లో నాలుగు వేల ఔట్ లెట్లను ఏర్పాటు చేసింది. ఇందులో ఒకటి భారత్ లోనూ ఉంది. యూఎస్ ఏం చేసినా అదే కరెక్ట్ అనే భావజాలాన్ని ఈ అవుట్ లెట్ లు జర్నలిస్టుల ద్వారా ముందే ప్రజల మనస్సుల్లో నాటువేయడమే వీరి పని. దీంతో అమెరికా చేయబోయే ప్రతీ పని ప్రపంచదేశాలకు మంచిగా కనబడడం, నిజమే అన్న భావనను కలిగిస్తుంది. 1982లో డేవిడ్ హాఫ్మన్ జర్నలిస్ట్ శిక్షణ ముసుగులో అవుట్ లెట్ ను ప్రారంభించారు. ఈయన ప్రారంభించిన సంస్థ వెనుక యూఎస్ ఎఐడీ ప్రమేయాన్ని కనబడనీయకుండా జాగ్రత్త పడ్డారు. ఈ సంస్థ వెనుక యూఎస్ ఉందని ప్రపంచానికి తెలియకూడదనే కుతంత్రం ఇందులో దాగి ఉంది.
భారత్ లో ఢిల్లీకి చెందిన డేటాలీడ్స్ భాగస్వామి. డేటాలీడ్స్ ఆధ్వర్యంలో ఫ్యాక్ట్ శాల పేరుతో శిక్షణనిస్తుంది. డేటాలీడ్స్ ను జర్నలిస్ట్ సయ్యద్ నజకత్ స్థాపించాడు. ఇతను ఫోర్డ్, సోరోస్ నిధులతో నడిచే జర్నలిస్ట్ గ్రూపులైన గ్లోబల్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం నెట్ వర్క్ బోర్డు సభ్యుడు కావడం విశేషం. ఈ సంస్థకు అనుబంధంగా ప్రశాంత్ భూషణ్ అనే సీనియర్ జర్నలిస్ట్ సంభావనా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీని ఏర్పాటు చేశారు. దీని ద్వారా వామపక్ష భావజాలాన్ని వ్యాప్తి చేస్తుంటారు. ఈ సంస్థ హిమాచల్ పాలంపూర్ లో శిక్షణా కేంద్రం ఉంది. ఫ్యాక్ట్ శాల సయ్యద్ నజకత్ తో ఈ ఇన్ స్టిట్యూట్ కు ఎనలేని అనుబంధం ఉంది. ఈ సంస్థల ఆధ్వర్యంలో ఇప్పటివరకు 2500 వర్క్ షాప్ లు నిర్వహించారు. 75వేల మంది విలేఖరులకు శిక్షణ ఇచ్చారు. వీరి ఫాలోవర్ల సంఖ్య 6.5 కోట్లకు చేరుకోవడం విశేషం. వీరి ప్రొఫైల్ లను వీక్షిస్తే వందలాది మంది పాత్రికేయులు కనిపిస్తారు. అంటే ఎంతపెద్ద ఎత్తున వామపక్ష జాలాన్ని భారత్ లోనూ వ్యాప్తి చేసేందుకు ప్రయత్నించారనేది బహిర్గతం అవుతుంది. ఈ సంస్థలకు కావాల్సిన సొమ్మంతా యూఎస్ఎఐడీ (యూఎస్–జార్జ్ సోరెస్)ల నుంచే పరోక్షంగా అందుతుంది.