ఐఈడీ పేలుడులో ఇద్దరు జవాన్లకు గాయాలు
Two jawans injured in IED blast

రాయ్ పూర్: చత్తీస్ గఢ్ లో నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ లో ఐఈడీ పేలి ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. మంగళవారం జరిగిన ఈ పేలుడు వివరాలను ఉన్నతాధికారి మీడియాకు వివరించారు. నక్సల్స్ కోసం కూంబింగ్ కొనసాగుతుండగా ఒక సైనికుడు ఐఈడీపై కాలు మోపాడన్నారు. అది పేలిపోయిందన్నారు. దీంతో సైనికులకు గాయాలయ్యాయని వారిని రాయ్ పూర్ లోని నారాయణ్ ఆసుపత్రికి తరలించి చికిత్సనందింపచేస్తున్నట్లు వివరించారు. భద్రతా దళాల కోసమే నక్సలైట్లు ఐఈడీని అమర్చినట్లు తెలిపారు. గాయపడిన వారిని డీఆర్జీ కానిస్టేబుల్ విజయ్ కుమార్ (26), సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ (42)లుగా తెలిపారు. కాగా సోమవారం అర్థరాత్రి బీజాపూర్ లోని టారెమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుగ్డి చెరు గ్రామంలో నక్సల్స్ ఇద్దరు గ్రామస్థులను చంపారు. పదునైన కత్తితో వీరి గొంతుకలను కోసి హత్య చేశారు. మావోయిస్టుల సమాచారాన్ని బయటపెట్టారనే అనుమానంతో వీరిని చంపినట్లుగా పోలీసులు తెలిపారు.