ఒత్తిడి ప్రయత్నాలను రాజ్యాంగబద్ధంగా తిప్పికొట్టాం

సీఈసీ రాజీవ్​ కుమార్​ 

Feb 4, 2025 - 18:37
 0
ఒత్తిడి ప్రయత్నాలను రాజ్యాంగబద్ధంగా తిప్పికొట్టాం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీ ఎన్నికలకు ముందు తమపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు జరిగాయని ఈసీ తెలిపింది. ఆప్​, ఇతర పార్టీలు చేస్తున్న ఆరోపణలపై ఈసీ ప్రధాన కమిషనర్​ సామాజిక మాధ్యమంలో మంగళవారం తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని అప్రతిష్ఠ పాలు చేసే ప్రయత్నం పదే పదే, ఉద్దేశ్యపూర్వకంగా జరుగుతున్నాయన్నారు. అయినా ఎన్నికల కమిషన్​ రాజ్యాంగబద్ధంగా, తెలివిగా, ఓపికగా వారి వారి ప్రభావాలకు లోనుకాకుండా నిర్ణయాలను తీసుకుందని తెలిపారు. కాగా ఈసీపై ఒత్తిడి తీసుకువచ్చిన ప్రయత్నాలు ఎవరు చేశారనే దానిపై కమిషనర్​ రాజీవ్​ కుమార్​ తెలియజేయలేదు.