భిన్నత్వంలో ఏకత్వమే హోళీ
పండుగ రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రి శుభాకాంక్షలు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భిన్నత్వంలో ఏకత్వం అనే విలువలను పెంపొందించే, ప్రతిబింబించే పండుగ హోళీ అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ అన్నారు. శుక్రవారం హోళీ పర్వదినం సందర్భంగా గురువారం ఓ ప్రకటన మాధ్యమంగా దేశ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంగుల పండుగ ఐక్యత, సోదరభావ స్ఫూర్తిని పెంపొదిస్తుందని పేర్కొన్నారు. విదేశాల్లోనూ ఈ పర్వదినం సంతోషం నిర్వహించుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధాని మోదీ..
దేశ ప్రజలు ఉల్లాసం, ఉత్సాహంతో నిర్వహించుకునే హోళీ పండుగ శుభాకాంక్షలను ప్రధాని మోదీ తెలిపారు. ఈ పండుగ ప్రతీ ఒక్కరి జీవితంలోని నూతన రంగులను, వెలుగులను విరజిమ్మాలని కోరుకున్నారు. ఈ పండుగ దేశవాసులను ఐక్యతదిశగా తీసుకువెళుతుందన్నారు.
కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి..
రంగులకేళీ హోళీని ప్రతీ ఒక్కరూ సంతోషంగా నిర్వహించుకోవాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం హోళీ పండుగ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతీ ఒక్కరి జీవితం అన్ని రంగుల సమ్మేళనంగా, అత్యద్భుతంగా కొనసాగాలని జి.కిషన్ రెడ్డి ఆకాంక్షించారు.