ఆప్ నేతలపై చర్యలకు ఎల్జీ ఆమోదం!
LG approves action against AAP leaders!

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఆప్ నాయకులు మనీష్ సిసోడియా, సత్యేంద్రజైన్ లకు మరిన్ని కష్టాలు చుట్టుముట్టనున్నాయి. గురువారం అవినీతి కేసులో తదుపరి చర్యలకు ఢిల్లీ ఎల్జీ అనుమతులకు ఆమోదం తెలిపారు. ఇప్పటికే పలుమార్లు జైలుకు వెళ్లి బెయిల్ పై బయటికి వచ్చిన మనీష్ సిసోడియాపై విద్యకు సంబంధించిన అవినీతిలో ఢిల్లీ ప్రభుత్వ విజిలెన్స్ డైరెక్టరేట్, అవినీతి నిరోధక చట్టం 1988లోని సెక్షన్ 17 కింద అనుమతులు కోరారు. అదే విధంగా సత్యేంద్ర జైన్ మాజీ పీడబ్ల్యూడీ మంత్రిపై కూడా చర్యలకు అనుమతి కోరగా ఎల్జీ ఆమోదించారు. ఇప్పటికే మద్యం అవినీతి కేసులో కూడా వీరు నిందితులుగా ఉన్నారు. ఇప్పుడు మరిన్ని కేసుల్లో చర్యలకు అనుమతించడంతో వీరిద్దరిపై ఇతర అవినీతి అంశాలపై కూడా దర్యాప్తు ఊపందుకోనుంది.