లోక్ సభలో త్రిభువన్ సహకారి యూనివర్సిటీ బిల్లు
Tribhuvan Sahakari University Bill in Lok Sabha

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: లోక్ సభలో సోవారం త్రిభువన సహకారి యూనివర్సిటీ బిల్లు–2025ను కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రి కృషన్ పాల్ గుర్జార్ ప్రవేశపెట్టారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్ను త్రిభువన్ సహకరి విశ్వవిద్యాలయంగా పిలవబడే విశ్వవిద్యాలయంగా, జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా ప్రకటించాలని బిల్లు ప్రవేశపెట్టారు. ఈ సంస్థ సహకార రంగంలో సాంకేతిక, నిర్వహణ విద్య, శిక్షణను అందిస్తుంది. సహకార పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. సహకార్ సే సమృద్ధి దృక్పథాన్ని సాకారం చేసుకోవడానికి ప్రపంచ శ్రేష్ఠత ప్రమాణాలను అందుకుంటుంది. ఇది సంస్థల నెట్వర్క్ ద్వారా దేశంలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేస్తుంది. ఇన్స్టిట్యూట్ను విశ్వవిద్యాలయ పాఠశాలల్లో ఒకటిగా ప్రకటిస్తుంది.