తొక్కిసలాటలో కుట్ర కోణం బీజేపీ ఎంపీ శంకర్​ ప్రసాద్​

BJP MP Shankar Prasad is the conspiracy angle in the stampede

Feb 3, 2025 - 18:03
 0
తొక్కిసలాటలో కుట్ర కోణం బీజేపీ ఎంపీ శంకర్​ ప్రసాద్​

నా తెలంగాణ, న్యూఢిల్లీ: మహాకుంభ మేళాలో తొక్కిసలాట ఘటనలో ఏదో కుట్ర కోణం ఉందని, దర్యాప్తులో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని బీజేపీ ఎంపీ రవిశంకర్​ ప్రసాద్​ అన్నారు. సోమవారం ఆయన పార్లమెంట్​ లో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ ప్రమాదంపై ఇంకా విచారణ కొనసాగుతుందన్నారు. 35 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారన్నారు. విచారణలో కుట్ర కోణాలు వెలుగుచూడనున్నట్లు తెలుస్తుందన్నారు. కుంభమేళా పేరు వింటేనే విపక్షాలు ఎందుకు ఆందోళన చెందుతున్నాయని రవిశంకర్​ ప్రసాద్​ నిలదీశారు. సనాతన అవమానాన్ని భారతదేశం ఎన్నటికీ సహించబోదని రవిశంకర్​ ప్రసాద్​ అన్నారు.