కూటమి విచ్చిన్నం.. ఒంటరిగానే పోటీ

The alliance is broken.. The competition is alone

Jan 11, 2025 - 15:02
 0
కూటమి విచ్చిన్నం.. ఒంటరిగానే పోటీ

శివసేన (యూబిటీ) సంజయ్​ రౌత్​

ముంబాయి: మహారాష్ట్ర శివసేన (యూబిటీ), ఇండియా బ్లాక్​, మహావికాస్​ అఘాడి కూటమి విచ్ఛిన్నమైంది. కూటమిగా వెళితే వ్యక్తిగతంగా అవకాశాలు లభించడం లేదని, అందుకే ముంబాయి, థానే, నాగ్​ పూర్​ తోపాటు ఇతర మున్సిపల్​ కార్పొరేషన్లు, జిల్లా కౌన్సిల్​, పంచాయితీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని సంజయ్​ రౌత్​ స్పష్​టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్దవ్​ ఠాక్రే నిర్ణయాన్ని వెల్లడించారు. కూటమి రాజకీయ పార్టీల సంస్థాగత అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందన్నారు. నాయకులు, కార్యకర్తలకు అవకాశాలు దక్కడం లేదన్నారు. అదీగాక ఎంవీఏ మహారాష్​ర్ట అసెంబ్లీలో పరాజయంపై కాంగ్రెస్​ నాయకడు విజయ్​ వాడెట్టివార్​ నిందలు సరికాదన్నారు. రాజీపై నమ్మకం లేని వారితో కూటమిలో ఉండబోమన్నారు. కనీసం కూటమికి కన్వీనర్​ ను కూడా నియమించుకోలేదన్నారు. కూటమిలో అతిపెద్ద పార్టీ తమదేనన్నారు. కనీసం సమావేశానికి పిలవాల్సిన బాధ్యతను కూడా కాంగ్రెస్​ విస్మరించిందని ఆరోపించారు. వ్యవసాయం, కార్మికులు, మౌలిక సదుపాయాలు లాంటి స్పష్టమైన హామీలను కూటమిలో తీసుకోనందునే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవి చూడాల్సి వచ్చిందని సంజయ్​ రౌత్​ అన్నారు.