కేజ్రీపై కాగ్ మరో నివేదిక
Another CAG report on Kejri

మద్యం అవినీతిలో రూ. 2026 కోట్లు నష్టం
ఆపద సీఎం పోస్టర్ రిలీజ్ చేసిన బీజేపీ
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కాగ్ రిపోర్టు ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ కుంభకోణంపై మరో నివేదిక విడుదల చేసినట్లు బీజేపీ తెలిపింది. మద్యం కుంభకోణం కేసులో రాష్ర్ట ప్రభుత్వ ఖజానాకు రూ. 2026 కోట్ల నష్ట వాటిల్లినట్లు తెలిపింది. శనివారం బీజేపీ పార్టీ నాయకులు కాగ్ విడుదల చేసిన నివేదికను మీడియాకు విడుదల చేశారు. నివేదిక విడుదలతో ఆప్ నేతల్లో టెన్షన్ పెరిగి అవన్నీ ఆరోపణలేనని విమర్శిస్తున్నారు. ప్రభుత్వం నష్టపోతుందని తెలిసినా బిడ్డర్లకు లైసెన్సులు కట్టబెట్టారని ఆరోపించారు. వీరు రూపొందించిన ఎక్సైజ్ పాలసీ లోపభూయిష్టంగా అభివర్ణించారు. దీంతో ఆప్ నేతలు భారీగా ముడుపులు దండుకున్నారని, మద్యం ప్రియులపై భారీ భారం పడిందని నివేదిక పేర్కొంది. మనీష్ సిసోడియా, మంత్రుల బృందం నిపుణులు చేసిన సిఫార్సులను పూర్తిగా విస్మరించారని కాగ్ రిపోర్టులో పేర్కొన్నారు. నిబంధనలకు తిలోదకాలిచ్చారు. ఉద్దేశ్యపూర్వకంగానే ఇదంతా జరిగింది. వీరు తీసుకున్న నిర్ణయానికి కేబినెట్, ఎల్జీ అనుమతి తీసుకోలేదన్నారు. నిబంధనల ఉల్లంఘన, కోవిడ్ పేరుతో రూ. 144 కోట్ల లైసెన్సు ఫీజుల మాఫీ, రీ టెండర్ చేయకపోవడం, జోనల్ లైసెన్సులకు మినహాయింపు ఇవ్వడం, సెక్యూరిటీ డిపాజిట్ ను రికవరి చేయకపోవడం తదితర కారణాలతో ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లిందని కాగ్ నివేదికలో స్పష్టం చేసింది.
బీజేపీ మరో పోస్టర్ రిలీజ్..
మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ ఆప్ అధినేతపై మరో పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ కు ‘ఆపదా సీఎం’ అని పేరు పెట్టింది. బాహుబలిలో విలన్ గెటప్ లో ఒక చిత్రం ఉండగా, మరో చిత్రంలో కేజ్రీ శీష్ మహల్ ముందు ముస్లిం రాజు వేషధారణలో ఉన్న పోస్టర్లను రిలీజ్ చేసింది.