బ్రహ్మపుత్రపై చైనా ప్రాజెక్టుపై నిఘా
రాజ్యసభలో కేంద్రమంత్రి వెల్లడి

నా తెలంగాణ, న్యూఢిల్లీ: బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న మెగా డ్యామ్ పై భారత్ నిఘా ఉంచిందని, చైనాకు తమ అభ్యంతరాలను కూడా తెలియజేసిందని కేంద్రమంత్రి కీర్తి వర్ధన్ సింగ్ అన్నారు. గురువారం పార్లమెంట్ లో ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఈ ప్రాజెక్టుపై భారత్ నిరంతరం పర్యవేక్షిస్తుందని నిశితంగా పరిశీలిస్తోందని సింగ్ చెప్పారు. ఎగువ ప్రాంతాలలో జరిగే కార్యకలాపాలతో దిగువ ప్రాంతాలైన భారత్ ప్రయోజనాలకు హాని కలిగించకుండా చూసుకోవాలని తేల్చి చెప్పామని అన్నారు. సరిహద్దు విషయంలో చర్చలు ఫలప్రదం దిశగా జరుగుతున్నాయని చెప్పారు. చైనా తన దేశ ప్రయోజనాల దృష్ట్యా బ్రహ్మపుత్రపై నిర్మించే ఈ ప్రాజెక్టు ద్వారా 60వేల మెగావాట్ల యూనిట్ల విద్యుత్ ఉత్పాదనకు సిద్ధమైంది. ఇందుకు 167 బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తుందని వివరించారు. ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లనుందని చెప్పారు. బ్రహ్మపుత్ర ఉపనదులపై ఒక అధ్యయనం కూడా నిర్వహించామన్నారు.