ఓటీపీలు చెప్పొద్దు: ట్రాయ్​ హెచ్చరిక

Don't tell OTPs: Troy warning

Feb 13, 2025 - 17:35
 0
ఓటీపీలు చెప్పొద్దు: ట్రాయ్​ హెచ్చరిక

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: 116 కోట్ల మంది మొబైల్​ వినియోగదారులకు మరోమారు ట్రాయ్​ (టీఆర్​ఎఐ–టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్​ ఇండియా) గురువారం హెచ్చరికలు జారీ చేసింది. ఎస్​ఎంఎస్​, కాల్స్​, సంక్షేమ పథకాల పేరిట వచ్చే వారికి ఎలాంటి ఓటీపీలు చెప్పవద్దని, అదే సమయంలో విదేశీ గుర్తు తెలియని కాల్స్​ ను లిఫ్ట్​ చేయొద్దని హెచ్చరించింది. అలాంటి వాటిని వెంటనే బ్లాక్​ చేసేయాలని స్పష్టం చేసింది. దేశంలో రోజురోజుకు సైబర్​ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది. ఎప్పటికప్పుడు ట్రాయ్​ మొబైల్​ వినియోగదారులకు సమాచారాన్ని అందజేస్తుందని తెలిపింది. టెలికాం సంస్థలు చట్టవిరుద్ధమైన కార్యకలాపాల సందేశాలు, ఫోన్లు చేయవని గుర్తుంచుకోవాలని స్పష్టం చేసింది.