సునీతా క్షేమంగా తిరిగి రావాలి
ప్రధాని మోదీ లేఖ

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత కుమార్తె సునీతా విలియమ్స్ క్షేమంగా తిరిగి రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. మంగళవారం అంతరిక్ష కేంద్రం ఐఎస్ఐఎస్ ను నుంచి బయలుదేరిన సునీతా విలియమ్స్ కోసం ప్రపంచం ఎదురుచూచ్తుందని ఆమెకు లేఖ పంపారు. ఈ లేఖను వ్యోమగామి మైక్ మాసిమినో సునీతా విలియమ్స్ కు పంపారు. ఈ లేఖలో ప్రధాని భారత ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలిపారు. ట్రంప్, బైడెన్ లను కలిసినప్పుడు కూడా సునీతా శ్రేయస్సు కోసం ప్రార్థించాను విచారించానని తెలిపారు. ఈ విజయం పట్ల భారత్ లోని 140 కోట్ల మంది ప్రజలు ఎల్లవేళలా గర్వంగా భావిస్తారని చెప్పారు. వేలమైళ్ల దూరంలో ఉన్నా, మా హృదయాలకు దగ్గరగానే ఉన్నారని ప్రధాని లేఖలో పేర్కొన్నారు. మిషన్ విజయం, ఆరోగ్యం కోసం ప్రజలు ప్రార్థిస్తున్నారని అన్నారు. 2016లో అమెరికా పర్యటనలో కలిసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. త్వరలోనే భారత్ కు కూడా రావాలని ఆకాంక్షించారు. తమదేశ కూతురికి ఆతిథ్యం ఇవ్వడం తమకు సంతోషకరమని చెప్పారు. సునీతా విలియమ్స్ తోపాటు బుచ్ విల్మర్ కూడా సురక్షితంగా భూమికి తిరిగి రావాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.