సంభాల్​ హింస విదేశాల్లో మూలాలు

80మంది అరెస్ట్​ 79మంది పరారీ

Feb 22, 2025 - 14:47
 0
సంభాల్​ హింస విదేశాల్లో మూలాలు

లక్నో: సంభాల్​ హింస మూలాలు విదేశాల్లో నక్కి ఉన్నాయి. పోలీసులు ఇటీవలే దాఖలు చేసిన చార్జీషీట్​ లోని పలు విషయాలు శనివారం వెలుగుచూశాయి. హింసకు కారణం ప్రధాన నిందితుడు దుబాయ్​ లో నక్కి ఉన్న షరీక్​ సాతాగా దర్యాప్తు బృందాలు గుర్తించాయి. కోర్టులో ఆరువేల పేజీల చార్జీషీట్​ ను పోలీసులు దాఖలు చేశారు. 2024 నవంబర్​ 24న హింస చెలరేగగా 12 ఎఫ్‌ఐఆర్‌లలో ఆరు కేసుల్లో అభియోగాలు మోపారు. చార్జిషీట్‌లో మొత్తం 159 మందిని నిందితులుగా చేర్చగా, 80 మందిని అరెస్టు చేశారు. 79 మంది పరారీలో ఉనారు. నిందితుల్లో ఎస్పీ నాయకులు సంభాల్​ ఎంపీ జియా ఉర్​ రెహమాన్​ బార్క్​, ఇక్భాల్​ మహమూద్​ కుమారుడు సుహైల్​ ఇక్బాల్​ పేర్లను కూడా చేర్చారు. 

నవంబర్​ 25న నిందితులై నాయకుల పేర్లను చేర్చారు. నవంబర్​ 28న దర్యాప్తునకు ముగ్గురు సభ్యులతో కూడిన న్యాయ కమిషన్​ ఏర్పాటు చేశారు. 29న జామా మసీదు కేసు విచారణ నిలిపివేయాలని సంభాల్​ కోర్టును సుప్రీంఆఏశించింది. కాగా అలహాబాద్​ హైకోర్టు విచారించే వరకు చర్యలు తీసుకోమని పేర్కొంది. డిసెంబర్​ 1, జనవరి 21, జనవరి 30 యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్​ మూడుసార్లు సంభాల్​ చేరుకొని ఉద్యోగులు, అధికారుల వాంగ్మూలాలను నమోదు చేసింది. 

కాగా ముఖ్య నిందితుడైన షరీక్​ సాతాను ఢిల్లీ ఎన్​ సీఆర్​ నుంచి 300కు పైగా వాహనాలను దొంగిలించిన కార్ల దొంగతన ముఠా నాయకుడుగా పోలీసులు పేర్కొంటున్నారు. ఇతనికి నేరుగా దావూద్​, పాక్​ ఐఎస్​ఐతో సంబంధాలున్నాయని చార్జీషీట్​ లో ఆరోపించారు.