తొక్కిసలాటపై ప్రాథమిక నివేదిక వెల్లడి

Preliminary report on stampede revealed

Feb 16, 2025 - 18:53
 0
తొక్కిసలాటపై ప్రాథమిక నివేదిక వెల్లడి

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: శనివారం రాత్రి న్యూ ఢిల్లీ తొక్కిసలాట ఘటనపై ప్రాథమిక నివేదిక ఆదివారం సమర్పించారు. ఫ్లాట్​ ఫామ్​ 14 వద్ద ప్రయాగ్​ రాజ్​ కు వచ్చే రైలు రాబోతుందని ప్రకటించారు. రైలు కాస్త ఆలస్యమైంది. అదనపు రైలు ఫ్లాట్​ ఫామ్​ 12పై వస్తుందని ప్రకటించారు. ఇది విన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఫ్లాట్​ ఫామ్​ 12పైకి వెళ్లేందుకు పరుగులు తీశారు. దీంతో మెట్ల మార్గంలో పలువురు కింద పడి తొక్కిసలాటకు కారణమైనట్లుగా ప్రాథమిక నివేదిక వెల్లడించింది. కాగా ఈ ఘటనపై ఇద్దరు ఉన్నతస్థాయి అధికారులతో సమగ్ర విచారణకు రైల్వే శాఖ మంత్రి ఆదేశించారు. తొక్కిసలాట ఘటనలో 18 మంది మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి.