చర్చలకు కట్టుబడి ఉండాలి

ఈజిప్ట్​, ఖతార్​ అధికారులకు హమాస్​ విజ్ఞప్తి

Feb 13, 2025 - 16:28
 0
చర్చలకు కట్టుబడి ఉండాలి

గాజాసిటీ: కాల్పుల విరమణ ఒప్పందం రద్దు కావాలని తాము కోరుకోవడం లేదని పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్​ గురువారం ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్​, ఇజ్రాయెల్​ ప్రధాని నెతన్యాహుల హెచ్చరిక నేపథ్యంలో హమాస్​ అభిప్రాయాన్ని వెల్లడించింది. యుద్ధ విరమణ ఒప్పందంలో భాగంగా శనివారం మరో ముగ్గురు బందీలను విడుదల చేయాల్సి ఉందని పేర్కొంది. అయితే ఇజ్రాయెల్ నిబంధనలను ఉల్లంఘించినందున విడుదలను నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. ప్రతిష్ఠంభనను తొలగించేందుకు హమాస్​ గాజా చీఫ్​ ఖలీల్​ ఈజిప్టు భద్రతాధికారులను కలిశారు. తిరిగి యుద్ధం జరగకుండా చర్యలు చేపట్టాలని, అదే సమయంలో ఇరుదేశాలు చర్చలకు కట్టుబడి ఉండాలని విజ్ఞప్తి చేశారు. యుద్ధం ఆపేందుకు ఈజిప్ట్​, ఖతార్​ అధికారులు కీలకభూమిక పోషించారు. ఇజ్రాయెల్​ బందీల్లో 30 మంది వరకు మృతి చెంది ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్​ తమ బందీలను ఒకేసారి విడుదల చేయాలని పట్టుబట్టింది. ఒకవేళ అలా జరగకుండా గాజాలో దాడులు ప్రారంభించే అవకాశం ఉంది.