సిక్కుల హత్య.. దోషి కాంగ్రెస్ మాజీ ఎంపీ!
Murder of Sikhs.. Convicted ex-Congress MP!

తీర్పునిచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు
ఫిబ్రవరి 18న శిక్ష ఖరారు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: సిక్కు అల్లర్ల కేసు 1984, ఇద్దరి హత్య కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు దోషిగా తేల్చింది. బుధవారం ఈ కేసుకు సంబంధించిన విచారణ జరిగింది. 41 ఏళ్ల తరువాత ఈ కేసులో తీర్పు రావడం గమనార్హం. కాగా ఫిబ్రవరి 18న కోర్టు శిక్షను ఖరారు చేయనుంది.2018లో ఢిల్లీ హైకోర్టు వేరే కేసులో ఇతన్ని దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. ప్రస్తుతం ఇతను తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. సజ్జన్ కుమార్ పై ఐపీసీ సెక్షన్లు 147, 149, 148, 302, 308, 323, 395, 397, 427, 436, 440 కింద అల్లర్లు, హత్య, దోపిడీ కింద కేసులే నమోదయ్యాయి. 1984లో అల్లర్లు చెలరేగగా సరస్వతి విహార్ లో జస్వంత్ సింగ్, తరుణ్ దీప్ సింగ్ అనే ఇద్దరు వ్యక్తులు హత్యకు గురయ్యారు. పంజాబీ బాగ్ పోలీస్ స్టేషన్ లో సజ్జన్ కుమార్ పై కేసు నమోదైంది. ఇందిరాగాంధీ హత్యకు ప్రతీకారంగానే కొందరు గుంపు ఓ ఇంటిపై దాడి చేసి ఇద్దరినీ హత్య చేశారు. కాగా ఆ సమూహాన్ని రెచ్చగొట్టింది సజ్జన్ కుమార్ అని ఇన్నేళ్లకు కోర్టు నిర్ధారించింది.