మోదీ, బీజేపీని ఓడించేందుకు యూఎస్ ఎఐడీ నిధులు
USAID funds to defeat Modi and BJP

కీలక విషయాలు వెల్లడించిన మైక్ బెంజ్
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: 2019 ఎన్నికల కంటే ముందు ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఆయా మాధ్యమాల ద్వారా పనిచేసిన అమెరికా విదేశాంగ శాఖ మాజీ సీనియర్ అధికారి మైక్ బెంజ్ యూఎస్ఎఐడీ విషయంలో భారీ నిజాలను బయటపెట్టాడు. మోదీ, బీజేపీని అస్థిరపరిచేందుకు యూఎస్ఎఐడీ నిధుల ద్వారా అనేక ప్రయత్నాలు జరిగాయి. మైక్ బెంజ్ గతంలో వైట్ హౌస్ లో ట్రంప్ నకు ప్రసంగాలను రాసి ఇచ్చే అధికారిగా కొలువు వెలగబెట్టాడు. ఇదంతా అమెరికా ప్రభుత్వ కనుసన్నల్లోనే జరిగింది. అంతేగాక భారత్–బంగ్లాల మధ్య రాజకీయ జోక్యానికి కూడా ప్రయత్నించింది.
పత్రికా మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల ద్వారా మోదీని ఓడించే ప్రయత్నాలు జరిగాయి. కానీ అందులో సఫలం సాధించలేదు. యూఎస్ఎఐడీ ప్రధాన ఉద్దేశం మోదీ, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వారిని రిక్రూట్ చేసుకొని వారి ద్వారా తప్పుడు ప్రచారాలకు తెరతీయడం వీరికి నష్టం కలిగించడం. అలాంటి సంస్థలు, వ్యక్తులకు నిధులను సమకూర్చడం కూడా ఈ సంస్థే చూసుకుంటుంది. సెన్సార్ షిప్, వీవర్స్ షిప్ ల ఆధారంగా మీడియా మాధ్యమాలను కూడా ఉపయోగించుకున్నారు. అసత్య కథనాలు సృష్టించారు. ఉద్యోగాన్ని వదిలిన అనంతరం మైక్ ఎన్జీవో సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా డిజిటల్ సెన్సార్ షిప్, మీడియా కథనాలపై అధ్యయనం చేస్తూ నివేదికలను రూపొందిస్తుంటాడు.
మైక్ బెంజ్ ఎవరు?..
మైక్ బెంజ్ 2020 నుంచి 2021 వరకు ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేసిన మాజీ యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ అధికారి. సైబర్ సమస్యలపై యూఎస్ విధానాన్ని రూపొందించడానికి, ప్రధాన టెక్ కంపెనీలతో దగ్గరగా పనిచేయడానికి ఈయన బాధ్యత వహించారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న తొలుతలో ఆయనకు ప్రసంగాలు రాసి పెట్టేవారు.