ఎంపీ సంబిత్ పాత్ర, దలైలామాకు జడ్​ కేటగిరి

ఐబీ హెచ్చరికతో కేంద్రం ఉత్తర్వులు జారీ

Feb 13, 2025 - 17:50
 0
ఎంపీ సంబిత్ పాత్ర, దలైలామాకు జడ్​ కేటగిరి

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఇంటలిజెన్స్​ హెచ్చరికల నేపథ్యంలో బీజేపీ ఎంపీ నాయకుడు సంబిత్​ పాత్ర, బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామా (89)కు కేంద్రం జడ్​ కేటగిరి భద్రత కల్పిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం వీరిద్దరికి సాధారణ భద్రతను కేంద్రం కల్పించింది. ఇంటలిజెన్స్​ బ్యూరో (ఐబీ) హెచ్చరికలతో అప్రమత్తమైంది. ప్రస్తుతం మణిపూర్​ బీజేపీ ఇన్​ చార్జీగా సంబిత్​ పాత్ర వ్యవహరిస్తున్నారు. ఇకపై వీరికి 30మంది సీఆర్పీఎఫ్​ కమాండోల బృందం భద్రత కల్పించనున్నారు. హిమాచల్​ ప్రదేశ్​ లో ఉన్న టిబెటన్​ మత గురువు దలైలామాకు ప్రస్తుతం స్థానిక భద్రత మాత్రమే లభిస్తుంది. 1950లో టిబెట్​ పై చైనా దాడి చేసి ఆక్రమించింది. దలైలామా భారత్​ కు వచ్చారు. అప్పటి నుంచి దలైలామాకు భారత్​ ఆశ్రయం కల్పిస్తుంది. 1989లో ఈయనకు నోబెల్​ శాంతి బహుమతి కూడా లభించింది.  టిబెట్​ న్ల న్యాయం కోసం ఎన్నో ఏళ్లుగా ఆయన పోరాటం చేస్తున్నారు. 62 సంవత్సరాలుగా భారత్​ లో ఉంటున్నారు. అయితే వీరిద్దరికి ఎవరి ద్వారా ప్రమాదం ఉందనేది మాత్రం ఐబీ వెల్లడించిన వివరాలను కేంద్రం బయటపెట్టలేదు.