పరిపాలనలో కీలక మార్పులు
Key changes in administration

మాతృవిభాగాల్లోకి అధికారులు
మహిళల ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్
మాజీ సీఎం, మంత్రుల వ్యక్తిగత సిబ్బంది సేవలు రద్దు
డిటీసీ బస్సులు, కాంట్రాక్టులపై ఆరా
ఆయుష్మాన్ భవ అమలుకు అడ్డంకులేంటీ?
ఆప్, అధికారుల్లో మొదలైన గుబులు
సీఎం రేఖా గుప్తా రెండో రోజు కీలక నిర్ణయాలు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి రేఖా గుప్తా పరిపాలనలో కీలకమైన మార్పులను చేశారు. శుక్రవారం ఉదయం సచివాలయానికి విచ్చేసిన ఆమె మార్పులకు శ్రీకారం చుట్టారు. ఆప్ హాయంలో ఏర్పాటు చేసిన కీలక పదవుల్లోని నాయకుల పరిపాలనలో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదే గాకుండా ఉచిత క్లినిక్ లలో అవకతవకలపై తనిఖీలు, మహిళలకు ఉచిత ప్రయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంటనే అధికారులు, ఉద్యోగులు వారి వారి మాతృ విభాగాల్లో రిపోర్టు చేయాలని ఆదేశించారు. మాజీ సీఎం, మంత్రుల వ్యక్తిగత సిబ్బంది సేవలను పూర్తిగా రద్దు చేశారు. డిటీసీ బస్సులపై వస్తున్న ఆరోపణలపై కూడా ఆరా తీశారు. బస్సులు కొనకుండానే కొన్నట్లు ఆప్ ప్రభుత్వం చూపినట్లు గుర్తించారు. పూర్తి సమాచారం అనంతరం ఉన్నతస్థాయి దర్యాప్తునకు సీఎం ఆదేశించనున్నట్లు తెలుస్తుంది. ఎన్నికలకు మూడు నెలల ముందు నుంచి గత ప్రభుత్వ కాంట్రాక్టులపై కూడా సీఎం సమాచారం కోరారు. అలాగే ఆయుష్మాన్ భవ అమలుపై కూడా సీఎం రేఖా గుప్తా ఆరా తీసినట్లు తెలుస్తుంది. గుప్తా దూకుడుపై ఆప్ పార్టీ నేతల్లో, అధికారుల్లో గుబులు మొదలైంది.