మియాపూర్ భూ ఆందోళన కాంగ్రెస్ పై కేటీఆర్ గరం గరం
KTR lashed out at the Miyapur land agitation Congress

నా తెలంగాణ, హైదరాబాద్: మియాపూర్ భూ ఆందోళనలపై బీఆర్ఎస్ కేటీఆర్ మండిపడ్డారు. ఆదివారం ఎక్స్ (ట్వీట్టర్) మాధ్యమంగా కాంగ్రెస్ ప్రభుత్వం పదునైన విమర్శలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయనడానికి ఈ ఘటనలే ఉదాహరణ అన్నారు. తమ ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితులు లేవన్నారు. మియాపూర్ భూముల్లో కొందరు గుడిసెలు వేసుకొని ఉండడంతో హెచ్ ఎండీఏ ఫిర్యాదు మేరకు పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించి వేశారు. ఈ సందర్భంగా పోలీసులకు గుడిసెలు వేసుకున్న వారికి మధ్య తీవ్ర గలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే.