కాంగ్రెస్​ ఎంపీ భార్యకు ఐఎస్​ఐ, జార్జ్​ సోరోస్​ తో నిధులు

Funding for Congress MP's wife with ISI and George Soros

Feb 12, 2025 - 18:11
 0
కాంగ్రెస్​ ఎంపీ భార్యకు ఐఎస్​ఐ, జార్జ్​ సోరోస్​ తో నిధులు

ఆరోపణలపై ఉన్నతస్థాయి విచారణకు బీజేపీ డిమాండ్​
స్పందించేందుకు నిరాకరించిన ఎంపీ కార్యాలయ వర్గాలు

డీస్ఫూర్​: కాంగ్రెస్​ ఎంపీ గౌరవ్​ గొగోయ్​ భార్య ఎలిజబెత్​ కోల్​ బోర్న్​ కు జార్జ్​ సోరోస్​, పాక్​ ఐఎస్​ ఐతో నిధులు సమకూరాయన్న ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని బీజేపీ డిమాండ్​ చేసింది. ఈ విషయంపై అసోం సీఎం హిమంత బిస్వా శర్మ ఆరోపణలు, పలు ప్రశ్నలు సంధించారు. విచారణలో నిజం నిగ్గు తేలుతుందన్నారు. కాగా ఈ విషయంపై పలు మీడియా సంస్థలు కూడా వివరాలను ప్రచురించాయి. దీంతో రాజకీయ దుమారం చెలరేగింది. కాగా ఆయా విషయాలపై పూర్తి ధృవీకరణ లభించలేదు. కోల్​ బోర్న్​ తన పదవీ కాలంలో పాక్​ ఐఎస్​ ఐ ద్వారా నిధులు సమకూరుతున్న ఒక ఎన్జీవో సంస్థతో కలిసి పనిచేసింది. ఈ సంస్థకు చీఫ్​ గా పాక్​ కు చెందిన అలీ తౌకీర్​ షేక్​ ఉన్నాడు. 2010 నుంచి 2015 మధ్య పలుమార్లు కోల్​ బోర్న్​ పాక్​ లో సందర్శనలు చేపట్టి ఈ ఎన్జీవో ప్రాజెక్టు ద్వారా పనిచేశారు. అదే సమయంలో జార్జ్​ సోరోస్​ ఓపెన్​ సొసైటీ ఫౌండేషన్​ లతో కూడా ఈమెకు దగ్గరి బంధాలున్నాయి. వీటికి సంబంధించిన అనేక ఆర్థిక లావాదేవీలు దేశ భద్రతకు ముప్పుగా పరిణమించాయి. ఈ విషయాలపై ఎంపీ గౌరవ్​ గొగోయ్​ ను మీడియా ప్రశ్నలు సంధించగా మౌనమే సమాధానంగా నిలిచింది. చట్టపరమైన విషయం అంటూ ఆయన కార్యాలయ వర్గాలు వ్యాఖ్యానించేందుకు నిరాకరించాయి.