ఫ్లాట్ గా ముగిసిన దేశీయ మార్కెట్లు
Domestic markets ended flat

ప్రారంభంలో ఎగిసి, ముగింపు దశలో కిందకు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: 2025–26 బడ్జెట్ నేపథ్యంలో శనివారం భారతీయ స్టాక్ మార్కెట్లు ప్రత్యేక ట్రేడింగ్ ను కొనసాగించాయి. తొలుత లాభాల్లో ఉన్న మార్కెట్లు కాస్త చివరిలో ఫ్లాట్ గా ముగిశాయి. ఉదయం నుంచి బడ్జెట్ ప్రకటనలు, వర్తల నేపథ్యంలో స్టాక్ మార్కెట్ ప్రారంభం కాగానే 12గంటల వరకు భారీ లాభాల్లో కొనసాగాయి. సెన్సెక్స్ 125.66 పాయింట్లు ఎగిసిపడగా, నిఫ్ట 23 పాయింట్ల వృద్ధిని సాధించింది. చివరకు సెన్సెక్స్ ఐదు పాయింట్ల పెరుగుదల, నిఫ్టీ 26 పాయింట్ల నష్టం, బీఎస్ ఇ మిడ్ క్యాప 212 పాయింట్లు నష్టపోయాయి. సెన్సెక్స్ ఐదు పాయింట్ల లాభంతో 77,505 వద్ద ముగియగా, నిఫ్టీ 26 పాయింట్లు పతనమై 23, 482 వద్ద ముగిసింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ 212 పాయింట్ల పతనంతో 42,884 వద్ద ముగిసింది. సెన్సెక్స్ లో 16 షేర్లు లాభాల్లో ట్రేడ్ కాగా, 14 షేర్లు నష్టాలను కూడగట్టుకున్నాయి. 50 నిఫ్టీలో 29 షేర్లు క్షీణించగా, 22 పెరిగాయి. అదే సమయంలో రియాల్టీ రంగం షేర్లు 3.38 శాతం పెరిగాయి. ఎఫ్ ఎంసిజ 3.01శాతం, ఆటో రంగం 1.91 శాతం పెరుగుదల నమోదైంది. బ్యాంకింగ్ 1.59 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 1.59 శాతం, ఐటీ రంగం 1.48 శాతం క్షీణించాయి. విదేశీ పెట్టుబడిదారులు రూ. 1,188.99 కోట్ల షేర్లను విక్రయించగా, దేశీయ పెట్టుబడిదారులు రూ. 2,232.22 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు. జనవరి 31తో పోల్చుకుంటే షేర్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగిసాయనే చెప్పొచ్చు.