బీకేఐ ఉగ్రవాది అరెస్ట్
BKI terrorist arrested in UP

కుంభమేళాపై దాడికి యత్నం
వివరాలు వెల్లడించిన డీజీపీ
లక్నో: మహాకుంభ్ మేళాలో దాడికి పథకం రచించిన ఉగ్రవాది లాజర్ మాసిహ్ ను అరెస్టు చేశామని, ఇతను బీకేఐ ఉగ్రవాది యూపీ డీజీపీ ప్రశాంత్ కుమార్ చెప్పారు. గురువారం ఈ ఉగ్రవాది అరెస్టు వివరాలను మీడియాకు వెల్లడించారు. లాజర్ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ ఉగ్రవాది అని చెప్పారు. ఇతను పంజాబ్ అమృత్ సర్ రాందాస్ కుర్లియన్ గ్రామంలో నివసిస్తున్నాడని చెప్పారు. ఇతనికి పాక్ ఐఎస్ ఐతో దగ్గరి సంబంధాలు ఉన్నాయని, వారి ద్వారా పలు పేలుడు పదార్థాలు, ఆయుధాలు అందుకున్నాడని చెప్పారు. మేళాలో దాడి కోసం ఐఎస్ ఐతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు గుర్తించామన్నారు. మహాకుంభ మేళా సందర్భంగా లాజర్ యూపీలోని కౌశాంబి, లక్నో, కాన్పూర్ లలో బస చేసినట్లు గుర్తించామన్నారు. తమకు అల్లర్లపై సమాచారం అందడంతో బందోబస్తు, రోజువారీ చెకింగ్ లతో పారిపోయాడన్నారు. ఇతను పోర్చుగల్ పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి పట్టుకున్నారని చెప్పారు. ఇతన్ని విచారించి కీలక విషయాలను రాబట్టామన్నారు.