దేశవ్యాప్తంగా ఒకే టోల్ కు ప్రభుత్వం సిద్ధం
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

నా తెలంగాణ, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఒకే టోల్ విధానానికి ప్రభుత్వం సిద్ధమవుతుందని కేంద్ర రోడ్డురవాణా, రహాదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడారు. ఏకరూప టోల్ విధానంతో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. భారతదేశ హైవేలో మౌలిక సదుపాయాల కల్పన అమెరికాతో సరిపోలుతున్నాయని తెలిపారు. సోషల్ మాధ్యమగా వచ్చ ఫిర్యాదులను కూడా సీరియస్ గా తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. టోల్ చార్జీలు పెరగడంతో ప్రయాణికుల్లో అసంతృప్తికి దారితీస్తుందన్నారు. 2023–24లో టోల్ వసూల్లు రూ. 64,809.86 కోట్లకు చేరుకుందని, అంతకుముందు సంవత్సరం కంటే 35 శాతం ఎక్కువన్నారు. 2019–20లో రూ. 27,503 టోల్ వసూళ్లు ఉన్నారన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఏడువేల కి.మీ. మేర హైవేలు నిర్మించారని గడ్కరీ తెలిపారు.