అక్రమ వలసదారుల్లో ఇద్దరు హత్యకేసు నిందితులు అరెస్ట్​

Among the illegal immigrants, two suspects in the murder case were arrested

Feb 16, 2025 - 15:58
 0
అక్రమ వలసదారుల్లో ఇద్దరు హత్యకేసు నిందితులు అరెస్ట్​

అమృత్​ సర్​: అమెరికా నుంచి భారత్​ కు తిరిగొచ్చిన వారిలో ఇద్దరు హత్య కేసు నిందితులను పాటియాలా పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వీరు 2023లో ఓ హత్య కేసులో నిందితులని ఎఫ్​ ఐఆర్​ నమోదైనట్లు తెలిపారు. వీరిద్దరిపై రాజ్ పురాలో కేసు నమోదైందన్నారు. సందీప్​, ప్రదీప్​ అనే యువకులను అదుపులోకి తీసుకున్నామన్నారు. 15న రెండో విమానం అక్రమ వలసదారులతో భారత్​ కు వచ్చింది. 158 మందితో కూడిన మూడో విమానం ఆదివారం రాత్రికి భారత్​ కు రానుంది. తొలి విమానంలో 104, రెండో విమానంలో 120 తిరిగి రాగా మూడో విమానంలో 158 మంది రానున్నారని అధికారులు వివరించారు. అక్రమ వలసదారుల్లో అత్యధికంగా పంజాబ్​, హరియాణా, గుజరాత్, ఉత్తరప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు చెందినవారున్నారు.