భారత్​ వైపు జపాన్​ సంస్థల చూపు

చైనా ఆర్థికానికి గండీ

Feb 16, 2025 - 16:19
 0
భారత్​ వైపు జపాన్​ సంస్థల చూపు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్​ ను జపాన్​ సంస్థలు మరో పారిశ్రామిక, అభివృద్ధి చెందుతున్న దేశంగా చూస్తున్నాయి. దీంతో చైనా వ్యాపారానికి భారీ ఎత్తున గండిపడనుంది. కరోనా కష్టకాలం తరువాత భారత్​ ను పశ్చిమాసియా, ఆఫ్రికా వంటి దేశాల్లో వృద్ధికి ఆస్కారం ఉన్న దేశమని జపాన్ కు చెందిన సంస్థలు విశ్వసిస్తున్నాయి. చైనా అవలంభిస్తున్న వన్​ ప్లస్​ విధానం కఠినంగా ఉండడం కూడా చైనాలోని జపాన్​ సంస్థలు భారత్​ వైపు మళ్లేందుకు ఆస్కారం కల్పిస్తున్నాయి. ఇప్పటికే డెలాయిట్​ సంస్థ చైనా నుంచి వెనక్కి వెళ్లాలని, భారత్​ లో తమ కార్యకలాపాలను విస్తృతం చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం కాస్త చైనా ఆర్థిక వ్యవస్థకు ఆశనిపాతంలా నిలవనుంది. మరోవైపు దేశీయంగానే మైక్రో చిప్​ లు తయారవుతుండడం కూడా సంస్థలు భారత్​ వైపు మొగ్గు చూపేందుకు మరో కారణంగా నిలుస్తుంది. పశ్చిమాసియా, ఆఫ్రికా, అమెరికా, ఫ్​రాన్స్​, బ్రిటన్​,  అరబ్​ దేశాల్లో భారత్​ లో తయారు చేస్తున్న మైక్రో చిప్స్​, సెమీ కండక్టర్స్​ ఎగుమతులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో సెమీ కండక్టర్​ రంగంలో ఇక్కడ అడుగు పెడితే ఎక్కువ లాభాలను ఆర్జించవచ్చని భావిస్తున్నాయి. ఇలాంటి సంస్థల్లో ముఖ్యం జపాన్​ సంస్థలున్నాయి. ఇందుకు అక్కడి ప్రభుత్వం కూడా భారత్​ తో వ్యూహాత్మక భాగస్వామ్యం కలిగి ఉండడంతో కార్యకలాపాల విస్తరణలో ఆటుపోట్లు తలెత్తకుండా ఉండనుంది. ఈ పరిణామాలు కాస్త చైనాకు మింగుడుపడనివిగా నిలవనున్నాయి. 
........